
జనరల్

హరియాణాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో ఇటీవల విజయవంతంగా ప్రారంభించిన హైడ్రోజన్ రైలుపై భారతీయ రైల్వేలు కీలక అప్డేట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, త్వరలో ఆపరేషన్ వేగాన్ని 110 కి.మీ.లకు పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
ఈ రైలుపై ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్స్ పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, హైడ్రోజన్ ఫ్యూయల్ సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర నిర్వహణ అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఈ సవాళ్లను అధిగమిస్తే దేశంలో హైడ్రోజన్ రైళ్ల వినియోగం, వాటి నెట్వర్క్ విస్తరణకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!