
జనరల్

ఆఫ్రికా దేశమైన కేప్ వెర్డెలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు మారుమూల ఫొగో ద్వీపంలో అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, టీనేజర్లు ఉన్నట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!