
జనరల్

పాన్ కార్డు, ఓటర్ ఐడీ మాత్రమే భారత పౌరసత్వానికి సరిపడే ఆధారాలు కావని గౌహతి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అసోంకు సంబంధించిన ఒక కేసులో ఫారినర్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం, భారత పౌరసత్వం కోరుకునే వారు 1971కు ముందు భారతదేశంలో నివసించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని నిరూపించే విశ్వసనీయ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలు వ్యక్తి గుర్తింపునే నిర్ధారిస్తాయని, అవి పౌరసత్వానికి తుది ఆధారాలు కావని హైకోర్టు పేర్కొంది. భారత పౌరసత్వాన్ని నిరూపించాలంటే చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన పత్రాధారాలను సమర్పించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!