

భారత్లో ఈ ఏడాది ఆగస్టు 1901 తర్వాత అత్యంత వేడిగా నమోదైన ఆగస్టుగా నిలిచింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం దేశ సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్కు చేరింది. ఇది సాధారణ సగటు 27.34 డిగ్రీల కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. ఆగస్టులో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలుగా నమోదై, 1901 తర్వాత ఇదే అత్యధికంగా నిలిచింది.
వేడి తీవ్రంగా ఉన్నప్పటికీ వర్షపాతం మాత్రం లోటుగా నమోదైంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా 213.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా, సాధారణం కంటే 16.3 శాతం తక్కువగా నమోదైంది. 2001 తర్వాత ఆగస్టులో నమోదైన అత్యల్ప వర్షపాతాల్లో ఇది ఏడోది. భూమధ్యరేఖా పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న మోస్తరు నుంచి బలమైన ఎల్నినో పరిస్థితులు వర్షపాతంపై ప్రభావం చూపాయని IMD తెలిపింది. సెప్టెంబరులోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం, సాధారణం కంటే అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!