

భారత్ పర్యావరణ హిత రైల్వే రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును 2026 జూలై 17న ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో పనిచేసే ఈ రైలు ప్రయాణ సమయంలో నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదల చేస్తూ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ 10 బోగీల రైలు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అవసరమైన దేశంలోని అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రం జింద్లో ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, 24 గంటల పర్యవేక్షణ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఈ ప్రాజెక్టుకు మరింత విశ్వసనీయతను అందిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!