

ప్రపంచ ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఏఐ యుగానికి అనుగుణంగా రూపొందించిన సోఫోస్ ఫ్యూజన్ అనే కొత్త ఏఐ ఆధారిత సైబర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 6.25 లక్షలకు పైగా సంస్థలు ఉపయోగిస్తున్న సోఫోస్ సెంట్రల్ ఆధారంగా రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ ఓపెన్ ఆర్కిటెక్చర్తో పనిచేస్తూ ఏఐ ఏజెంట్ల సహాయంతో నెట్వర్క్, క్లౌడ్, ఎండ్పాయింట్లు, ఐడెంటిటీ సిస్టమ్లను ఒకే వేదికపై సమన్వయం చేస్తుంది. అమెరికాకు చెందిన సెక్యూర్వర్క్స్ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత విడుదలైన తొలి ప్రధాన ఉత్పత్తి ఇదే.
సోఫోస్ ఫ్యూజన్ లో నెక్స్ట్-జెన్ SIEM, ఏఐ డిఫెన్స్, ఎక్స్డీఆర్ (ఎక్స్టెండెడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్), మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (MDR), సీఎస్ఐఎస్ఓ అడ్వాంటేజ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఏఐ సహాయంతో ముప్పులను వేగంగా గుర్తించి కేవలం 89 సెకన్లలో ఆటోమేటిక్ స్పందన అందించగలదని సంస్థ వెల్లడించింది. తమ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లో నమోదయ్యే 52 శాతం కేసులను ఏఐ స్వయంగా పరిష్కరిస్తోందని తెలిపింది. ఇదే సమయంలో ఫిషింగ్ ఇమెయిల్స్ ప్రస్తుతం ర్యాన్సమ్వేర్ దాడులకు ప్రధాన కారణంగా మారాయని సోఫోస్ తాజా నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!