

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొంటూనే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర తమ ప్రభుత్వానిదేనని, ఎలాంటి పాత్ర లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
జీఎంఆర్తో ఒప్పందం నుంచి భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సహాయం వంటి అన్ని కీలక పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయని జగన్ తెలిపారు. ఈ పనుల కోసం సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్న ఆయన, విమానాశ్రయానికి సరైన రహదారి కనెక్టివిటీ ఇప్పటికీ లేకపోవడం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఇతరుల కృషికి క్రెడిట్ తీసుకోవడం మానుకుని పెండింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!