

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్రతిపాదిత ఐపీఓ డి-మార్ట్ అధిపతి, ప్రముఖ పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీకి గణనీయమైన లాభాలను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆయనకు 1.58 శాతం వాటాకు సమానమైన 3.91 కోట్ల షేర్లు ఉన్నాయి. ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ ధర రూ.1,785గా పరిగణిస్తే, ఆయన వాటా విలువ సుమారు రూ.6,980 కోట్లుగా ఉంటుంది.
దమానీ వద్ద ఉన్న షేర్ల సంఖ్యను బట్టి ఎన్ఎస్ఈ షేరు ధరలో ప్రతి రూ.10 పెరుగుదల ఆయన పెట్టుబడి విలువను సుమారు రూ.40 కోట్ల మేర పెంచుతుంది. అదే విధంగా షేరు ధర ప్రతి రూ.10 తగ్గితే ఆయన పెట్టుబడి విలువ కూడా దాదాపు రూ.40 కోట్ల మేర తగ్గుతుంది.
ఇక ఎన్ఎస్ఈ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా షేర్లను విక్రయిస్తున్న ప్రస్తుత వాటాదారులకు కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. 10 మంది వాటాదారులు తమ షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ.17,035 కోట్లు పొందనున్నట్లు సమాచారం. ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు వారు గతంలో ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.534 కోట్లు మాత్రమే. దీంతో ఈ వాటాదారులకు మొత్తంగా దాదాపు రూ.16,501 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!