
బిజినెస్

జపాన్ ప్రధాని సునాయె తకాయిచి తొలిసారిగా భారత్లో అధికారిక పర్యటనకు రానున్నారు. జూలై 1 నుంచి 3 వరకు ఆమె భారత పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటన సందర్భంగా భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
భారత్లో జరుగనున్న 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో సునాయె తకాయిచి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ సహకారానికి కొత్త దిశలను నిర్దేశించడం ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశముంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!