

నీట్–పీజీ 2026 పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. పరీక్షార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఈసారి పరీక్ష కేంద్రాల ఎంపికలో మూడు ఆప్షన్లు ఇవ్వనుంది. దీంతో అభ్యర్థులు తమ సొంత నగరం లేదా సమీప ప్రాంతంలో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే పరీక్ష కేంద్రం వివరాలను పరీక్షకు మూడు వారాల ముందే వెల్లడించనుండటంతో ప్రయాణం, వసతి తదితర ఏర్పాట్లను ముందుగానే చేసుకునే వీలు కలుగుతుంది.
పరీక్షల పారదర్శకత, భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రశ్నాపత్రం తయారీ నుంచి ముద్రణ, రవాణా వరకు అన్ని దశల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. దరఖాస్తు సమయంలోనూ, పరీక్ష రోజునూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. వేలిముద్ర సరిపోలని సందర్భంలో ఐరిష్ బయోమెట్రిక్ను వినియోగిస్తారు. ఈసారి ప్రశ్నల సంఖ్యను 200 నుంచి 180కు తగ్గించి, పరీక్ష సమయాన్ని 210 నిమిషాలుగా నిర్ణయించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!