
సినిమాలు

అమెరికా ఇరాన్పై మరోసారి వైమానిక దాడులకు దిగింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఫారూర్ దీవిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ఖేష్మ్ దీవి, బందర్ అబ్బాస్, బుషెహర్ పోర్ట్ ప్రాంతాలపైనా వైమానిక దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నిర్వహించిన ప్రతిదాడుల్లో కూడా నష్టం జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!