
ఓటీటీ

రిటైర్డ్ జడ్జి అభినందన్ కుమార్ షావిలి తన భూమిని నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలోని సర్వే నంబర్ 103/45Aలో తనకు చెందిన 3.26 ఎకరాలు, అలాగే 103/45Eలో తన తమ్ముడికి చెందిన 1.04 ఎకరాలను కలెక్టర్ నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
1980లో చట్టబద్ధంగా ఈ భూములు కొనుగోలు చేశామని, ఆధారాలు లేకుండా వాటిని అసైన్డ్ భూముల జాబితాలో చేర్చడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఈ అంశం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినదిగా పేర్కొన్న హైకోర్టు, సంబంధిత రోస్టర్ బెంచ్ ఎదుట విచారణకు ఉంచాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!