

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి నర్సింహారెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన చివరి వరకు నీతి, నిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ, భూదానోద్యమంలో సుమారు 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా ప్రశంసించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొమ్మిడి నర్సింహారెడ్డి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నిరాడంబరత, నిజాయితీకి ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటూ, తెలంగాణ ఉద్యమం, భూదానోద్యమం, గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఇరువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!