
క్రీడలు

మహిళల యూత్ హాకీ5ఎస్ ఆసియా ఛాంపియన్షిప్-2026 సన్నాహక శిబిరానికి హాకీ ఇండియా 15 మంది సభ్యులతో కూడిన సబ్ జూనియర్ మహిళల జట్టును ఎంపిక చేసింది. జూలై 4 నుంచి 18 వరకు భోపాల్లోని మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో ఈ జాతీయ శిక్షణ శిబిరం జరుగుతోంది. మాజీ భారత కెప్టెన్, ప్రధాన కోచ్ రాణి పర్యవేక్షణలో ఆటగాళ్లు ఒమాన్లోని మస్కట్లో జరిగే టోర్నీ కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
ఈ శిబిరంలో హాకీ5ఎస్కు అవసరమైన నైపుణ్యాలు, వ్యూహాత్మక అవగాహన, ఫిట్నెస్, వేగవంతమైన ఆటతీరుపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. సబ్ జూనియర్ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారిణులను తీర్చిదిద్దడమే హాకీ ఇండియా లక్ష్యమని పేర్కొంది. జాతీయ శిబిరాలకు సహకరిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కోచ్ రాణి కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!