
క్రీడలు

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. ఈ ఘటనపై సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున్తో పాటు తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని డీఎంకే ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారంలో సీఎం విజయ్తో పాటు ఇతర టీవీకే నేతలపై బహిరంగ ప్రకటనలకు ఎలాంటి న్యాయపరమైన ఆంక్షలు ఉండవని స్పష్టమైంది. ఇక ఘటనకు సంబంధించిన ఇతర న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!