
సినిమాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గన్నవరం క్రాస్రోడ్డు వద్ద చిరుతపులి చర్మం, గోర్లను తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఐదుగురి వివరాలను అధికారులు వెల్లడించగా, మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. చిరుత చర్మం, గోర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!