
జనరల్

తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఈ నెల 19న మరోసారి సమావేశం కానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో తన ప్రవర్తనకు సంబంధించి ఇచ్చిన వివరణపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గతంలోనూ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టి కౌశిక్ రెడ్డికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణను పరిశీలించిన అనంతరం, వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించేందుకు ఎథిక్స్ కమిటీకి శాసనసభ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న జరిగే సమావేశంలో తదుపరి చర్యలు, నివేదిక రూపకల్పనపై చర్చించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!