
జనరల్

భారతీయ రైల్వేలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్లో జూలై 2026 వరకు రూ.1.14 లక్షల కోట్లకు పైగా నిధులను వినియోగించినట్లు వెల్లడించింది. మొత్తం రూ.2.93 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపుల్లో ఇది దాదాపు 39 శాతంగా ఉంది. రైల్వే భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా కవచ్ 4.0 వ్యవస్థను ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో 2,633 రూట్ కిలోమీటర్ల మేర విజయవంతంగా అమలు చేశారు.
రైల్వే భద్రతా పనుల కోసం జూన్ 2026 వరకు కవచ్ ప్రాజెక్టులపై రూ.3,875 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు సుమారు రూ.8.31 లక్షల కోట్ల వ్యయంతో 40,000 కిలోమీటర్ల పరిధిలో 514 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టారు. అలాగే సుమారు 6 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం శిక్షణ అందిస్తూ నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!