
జనరల్

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యక్ష రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుకుగా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రవ్నీత్ సింగ్ బిట్టు 2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్లో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన బిట్టు, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన స్థానంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!