
గాసిప్స్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉన్న హేజోలో ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పేలుడు తర్వాత కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలముకుంది. రసాయనాలు లీక్ అవుతుండటంతో ఘాటైన వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు రసాయనాల వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రసాయనాల లీకేజీ కారణంగా పొగ పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. మూడు నెలల వ్యవధిలో ఇదే కంపెనీలో రెండోసారి రియాక్టర్ పేలడం ఆందోళన కలిగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!