
జనరల్

వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సెకన్ల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో పలు నగరాలు, పట్టణాల్లో భవనాలు కూలిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 160 మందికి పైగా మరణించగా, 970 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి.
భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు అంతరాయం కలిగాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా అధ్యక్షుడు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుండగా, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!