

తెలంగాణ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న సీఎంకు పార్క్ హయత్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమ్మక్క–సారక్క ఎత్తిపోతల పథకంపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి భద్రత కల్పించడంలో ఈ ప్రాజెక్టు కీలకమని మంత్రి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర అనుమతుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోందని, చత్తీస్ఘడ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పెండింగ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!