
జనరల్

వెనెజువెలాలో వరుస భూకంపాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందగా, సుమారు 700 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. రాజధాని కరాకస్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనెజువెలాకు తక్షణ సహాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే అమెరికా సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!