
జనరల్

తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్కు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి జరిగిన చోరీ కలకలం రేపింది. బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఎస్-3, ఎస్-6 బోగీల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు సమాచారం. ఘటన అనంతరం చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది.
దుండగులు పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రహదారి వైపు పారిపోతుండగా, ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వెంటాడారు. ఈ క్రమంలో తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అప్పికట్ల, బత్తిపూడి పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!