
బిజినెస్

జనసేన పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు నాగబాబు ఆగస్టు 28న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేని కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు నాగబాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతారని నాగబాబు పేర్కొన్నారు. అందువల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు అభినందనలు తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరినీ త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!