

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ అమర జవాన్ల పేర్లను జాతీయ యుద్ధ స్మారకం అధికారిక వెబ్సైట్లో నమోదు చేయడంతో పాటు, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. దేశ రక్షణలో చేసిన వారి త్యాగానికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు ఆర్మీ సిబ్బందితో పాటు ఒక అగ్నివీర్ వీరమరణం పొందారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్ ఈ జాబితాలో ఉన్నారు. రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్కు మరణానంతరం వీర చక్ర, సార్జెంట్ సురేంద్ర కుమార్కు వాయు మెడల్ ప్రదానం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ జమ్మూకశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ అమరుడయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!