
జనరల్

నేపాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 700 దాటినట్లు సమాచారం. మరో 2,426 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 5,851 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.
భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!