

మలయాళంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఉన్మాదం’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. కుంచకో బోబన్, లిజోమోల్ జోసే, రైనా రాధాకృష్ణన్, సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను ఓటీటీ సంస్థ విడుదల చేసింది.
‘నాయట్టు’, ‘జోసెఫ్’ వంటి చిత్రాలకు కథలు అందించిన షాహి కబీర్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించగా, ఎడిటర్ కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. పోలీస్ శాఖలో పనిచేస్తూనే రచయితగా మారాలని కలలు కనే షెల్లీ అనే పోలీస్ అధికారి చుట్టూ కథ సాగుతుంది. ఆరేళ్ల క్రితం మూసివేసిన కేసును అతడు మళ్లీ ఎందుకు తెరిచాడు? ఆ కేసు గురించి అందరూ ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే దాని వెనుక శాపం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!