
జనరల్

కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటుడు, దర్శకుడు, రచయిత రిషబ్ శెట్టి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసిన దేశంలోని టాప్–100 ప్రముఖుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. నటన, దర్శకత్వం, రచన.. మూడు విభాగాల్లో ఒకేసారి గుర్తింపు పొందిన ఏకైక భారతీయ సినీ ప్రముఖుడిగా రిషబ్ శెట్టి నిలిచినట్లు సమాచారం.
‘కాంతార’ ఫ్రాంచైజ్ విజయంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హొంబాళె ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’తో పాటు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలోనూ రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!