
సినిమాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్కు విశాఖపట్నంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు.
ఆగస్టు 18 ఉదయం నితిన్ నబీన్ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖపట్నంలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఐదు రోజుల పర్యటనలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై ఆయన నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!