
రాజకీయాలు

జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల వ్యక్తిగత వివరాలు క్లౌడ్ స్టోరేజ్ లోపం కారణంగా బహిర్గతమయ్యాయని వచ్చిన వార్తలపై ఐఐటీ రూర్కీ స్పందించింది. ఈ ఆరోపణలను తప్పుడు కథనాలుగా పేర్కొన్న సంస్థ, క్లౌడ్ కాన్ఫిగరేషన్లో లోపం ఉన్నప్పటికీ డేటా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది.
క్లౌడ్లో నిల్వ ఉన్న సమాచారం కేవలం చదవడానికి మాత్రమే వీలుందని, ఎవరూ మార్పులు చేయలేరని ఐఐటీ రూర్కీ తెలిపింది. విద్యార్థుల మార్కులు, ర్యాంకులు లేదా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని స్పష్టం చేసింది. డేటా గోప్యతను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!