

రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఎకో టూరిజం, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
భద్రాచలం పరిసరాల్లోని కిన్నెరసాని, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, నల్లమల అటవీ ప్రాంతాలు, అలాగే అనంతగిరి, వికారాబాద్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సంజయ్ జాజు పేర్కొన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!