
జనరల్

ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కోలీవుడ్లో భారీ బాక్సాఫీస్ పోరు జరగనుంది. సూర్య నటిస్తున్న "విశ్వనాథ్ అండ్ సన్స్" మరియు నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన "హాయ్" చిత్రాలు రెండూ ఆగస్టు 14న ఒకేసారి థియేటర్లలో విడుదల కానున్నాయి. గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు.
విష్ణు ఏడవన్ దర్శకత్వంలో రూపొందుతున్న "హాయ్" రొమాంటిక్ కామెడీగా రానుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "విశ్వనాథ్ అండ్ సన్స్" పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొనడంతో బాక్సాఫీస్ పోరుపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!