
సినిమాలు

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.
పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని పరిశ్రమల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!