

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జాతీయ బీజేపీ నాయకత్వం తెలంగాణ నేతలతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. బెంగాల్ విజయాన్ని తెలంగాణలో కూడా పునరావృతం చేయాలని పార్టీ సంకల్పించిందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నభి రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసినట్లు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, పలు సంక్షేమ పథకాలను కొనసాగించకుండా ప్రజలను నిరాశపరిచిందని ఆయన ఆరోపించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో జరిగిన సమస్యలు ఇంకా ప్రజల మదిలో ఉన్నాయని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలు, అసైన్డ్ భూములు, పేదల ఇళ్ల కూల్చివేతలు వంటి అంశాలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజల్లో మార్పు కోరిక పెరుగుతోందని ఈటల రాజేందర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!