

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించారు. పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని కూడా అన్నా లెజినోవా సందర్శించారు.
ఆ తర్వాత కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అన్నా లెజినోవాకు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకుంటూ అన్నా లెజినోవా ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని కూడా ఆమె దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!