

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ అందించిన సుదీర్ఘ ప్రజా సేవను ప్రస్తావిస్తూ పలువురు నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొంటూ, ఆయన మరింతకాలం ప్రజాసేవ కొనసాగించేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మోదీ జీవితం, దేశసేవ పట్ల ఆయన అంకితభావం కోట్ల మందికి స్ఫూర్తినిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా మోదీ సాగించిన 25 ఏళ్ల ప్రజాసేవను ప్రస్తావిస్తూ, దేశ అభివృద్ధి ప్రయాణానికి ఆయన నాయకత్వం వేగం ఇచ్చిందన్నారు. ఏపీ అభివృద్ధికి అమరావతి, పోలవరం, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న మద్దతును పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఎంపీ కంగనా రనౌత్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!