
ఓటీటీ

ఇటీవల పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ వివాదాల నేపథ్యంలో టెలిగ్రామ్పై విధించిన ఆంక్షలపై ఆ సంస్థ సీఈవో పావెల్ దురోవ్ స్పందించినట్లు సమాచారం. గోప్యమైన పరీక్షా పత్రాలను లీక్ చేసిన అసలు నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం బదులుగా, లక్షలాది మంది సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
డిజిటల్ ప్లాట్ఫామ్లపై నిషేధాలు విధించడం వల్ల అక్రమ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవని, అవి ఇతర వేదికలకు మారే అవకాశం ఉంటుందని దురోవ్ పేర్కొన్నారు. సమస్యకు మూల కారణాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పరిష్కారమని, సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే విస్తృత ఆంక్షలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేవని ఆయన అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!