
జనరల్

తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా గూడూరులో 40 మి.మీ, పల్నాడు జిల్లా నెమలికల్లులో 25 మి.మీ, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2 మి.మీ, శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరి, అనంతపురం జిల్లా హంపాపురంలో 22 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!