
సినిమాలు

కోనసీమ జిల్లా అంతర్వేది మండలం పల్లిపాలెం మినీ హార్బర్లో మత్స్యకారులకు అరుదైన ‘కచిడి’ చేపలు వలకు చిక్కాయి. ఒక్కోటి 12 నుంచి 13 కిలోల బరువు ఉన్న మూడు భారీ చేపలు దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన చేపలు దొరకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఈ చేపలను ఓ వ్యాపారి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. ఔషధ గుణాలు కలిగి ఉండటంతో కచిడి చేపలకు ప్రత్యేక మార్కెట్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అరుదైన చేపలను చూసేందుకు మినీ హార్బర్ వద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆసక్తిగా తిలకించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!