
సినిమాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల కానుకల ద్వారా వచ్చే హుండీ ఆదాయం సరికొత్త రికార్డును నమోదు చేసింది. జులై 2026లో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల చరిత్రలో ఇది రెండో అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నమోదైంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పించారు.
ఆగస్టు 2022లో నమోదైన రూ.140.34 కోట్ల హుండీ ఆదాయం ఇప్పటికీ అత్యధికంగా కొనసాగుతోంది. జులై 2026లో కేవలం రూ.6 లక్షల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే నెలలో 24.52 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ గణాంకాలు వెల్లడించాయి. భక్తుల అపార విశ్వాసం, శ్రీవారి వైభవానికి ఇది నిదర్శనమని టీటీడీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!