

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యలో సంస్కరణల భాగంగా విద్యార్థులను చిన్న వయస్సు నుంచే ఆధునిక సాంకేతికతకు పరిచయం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారానికి 80 నిమిషాల పాటు ఏఐ ఆధారిత పాఠాలను అందించనున్నారు. గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగించనున్నారు.
గణితానికి వారానికి రెండు సార్లు 20 నిమిషాల చొప్పున, భాషా సబ్జెక్టులకు కూడా సమాన సమయాన్ని కేటాయించి మొత్తం 80 నిమిషాల పాటు ఏఐ ఆధారిత బోధన నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన కార్యక్రమాన్ని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేశారు.
గత నాలుగేళ్లలో చేపట్టిన చర్యలతో జాతీయ స్థాయి సర్వేల్లో తెలంగాణ ర్యాంకు 36 నుంచి 26కు మెరుగుపడింది. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జులైలో ప్రాథమిక పరీక్ష, నవంబర్లో మధ్యంతర పరీక్ష, మార్చిలో తుది పరీక్ష నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!