
సినిమాలు

మధ్యప్రదేశ్లోని హేతంపూర్ సమీపంలో విషాదకర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్పూర్ వెళ్తున్న రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కొందరు అత్యవసర చైన్ లాగి రైలును ఆపి, ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో పట్టాలపైకి దూకినట్లు సమాచారం.
అదే సమయంలో పక్క ట్రాక్పై వస్తున్న పాతాళ్కోట్ ఎక్స్ప్రెస్ పట్టాలపై ఉన్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!