
జనరల్

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ముఖ్యమైన సీసీ దృశ్యాలు మాయమైనట్లు గుర్తించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న దాదాపు నెల రోజుల రికార్డులు వ్యవస్థ నుంచి తొలగించబడినట్లు విచారణలో తేలింది.
నెల రోజుల దృశ్యాల స్థానంలో కేవలం రెండు రోజుల రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. నెల రోజుల సీసీ దృశ్యాలను భద్రపరచాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధారాలను నాశనం చేసేందుకు ఈ దృశ్యాలు తొలగించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తొలగించిన దృశ్యాలను తిరిగి పొందేందుకు నిపుణుల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రయత్నాలు వేగవంతం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!