

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువత, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్లతో సంభాషించారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికే పరిమితం కాదని, యువతలోని శక్తిని మేల్కొలిపే సాధనాలని అన్నారు. దేశ అభివృద్ధికి యువశక్తితో పాటు క్రీడాశక్తి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఒలింపిక్స్లో భారత్కు తగిన స్థాయి ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని మోదీ అన్నారు. దేశంలో ప్రతిభకు కొదవ లేదని, చిన్న వయసులోనే క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ప్రతిభను వెలికితీయాలని సూచించారు. రాబోయే ఒలింపిక్స్లో భారత్ మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు, డిసెంబర్లో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో పోటీలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!