

నేపాల్లో 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరిలో 73 మంది త్రిశూలీ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు ఉన్నారు. కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన రెండు వేర్వేరు బృందాల్లోని 37, 49 మంది కూడా ప్రస్తుతం ఆచూకీ లేకుండా ఉన్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 32 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది, కేరళకు చెందిన 33 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు.
నేపాల్లో పరిస్థితుల నేపథ్యంలో భారత అధికారులు సంబంధిత వర్గాలతో సమన్వయం చేస్తూ గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను ఇవాళ సురక్షితంగా రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత, రక్షణ కోసం చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!