
క్రీడలు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్నుశాఖ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సొమ్ము మూలాలు, నిధుల ప్రవాహంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్లో సిట్, ఈడీ అధికారులతో సమావేశమైన ఐటీ అధికారులు.. కేసుకు సంబంధించిన మనీ ట్రయల్, నిందితులు, సంస్థలు, బ్యాంకు ఖాతాల వివరాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో డొల్ల లేదా ఫ్రంట్ కంపెనీల ద్వారా భారీగా నిధులు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దుబాయ్ సహా విదేశాలకు సొమ్ము తరలించిన అంశంపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఏయే కంపెనీల ద్వారా నిధులు మళ్లించారనే వివరాలతో పాటు, విదేశీ ఖాతాలు, బినామీ సంస్థలు, సంబంధిత వ్యక్తులపై కూడా ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!