
క్రీడలు

తమిళనాడులో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని వెంటనే సందర్శించాలని సంబంధిత మంత్రులను ఆదేశించిన ఆయన, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సీఎం విజయ్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించి, మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!