

భారత్లో గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్కు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.48 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.20,485 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాలు బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల నిర్వహణపై దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అయితే రుణాలను రైటాఫ్ చేయడం అంటే రుణమాఫీ చేయడం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను సరిచేసేందుకు, నిరర్థక ఆస్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టే అకౌంటింగ్ ప్రక్రియలో భాగంగానే రైటాఫ్ చేస్తారని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేసినప్పటికీ, దాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతపైనే కొనసాగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం బ్యాంకులు బకాయిల వసూలు కోసం చర్యలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!