
జనరల్

తెలంగాణలో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కమిషనర్ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ సభ్యులుగా ఉంటారు.
22-ఏ నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ రిజిస్ట్రేషన్లు, భూ రికార్డులకు సంబంధించిన అంశాలను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించడం కమిటీ ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై మార్గదర్శకాలు, విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!